డిక్లరేషన్పై ప్రతిపక్షాలవి అనవసర రాద్ధాంతం: మంత్రి వేణుగోపాల
ABN , First Publish Date - 2020-09-23T14:49:52+05:30 IST
రాజకీయ లబ్ది పొందడానికి ప్రతిపక్షాలు డిక్లరేషన్పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శలు గుప్పించారు.
తిరుమల: రాజకీయ లబ్ది పొందడానికి ప్రతిపక్షాలు డిక్లరేషన్పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రి జగన్ పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. స్వామి వారిపై ఉన్న భక్తి, విశ్వాసంతోనే జగన్ గతంలో కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే... కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.