జగన్తో ముగిసిన మంత్రి భేటీ; టికెట్ ధరలపై నిర్ణయం తీసుకోలేదు: పేర్నినాని
ABN , First Publish Date - 2022-02-10T01:35:38+05:30 IST
జగన్తో ముగిసిన మంత్రి భేటీ; టికెట్ ధరలపై నిర్ణయం తీసుకోలేదు: పేర్నినాని
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంత్రి పేర్నినాని సమావేశం ముగిసింది. గురువారం రోజు సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం ఉంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తారని మంత్రి పేర్కొన్నారు. సినిమా టికెట్ ధరల అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్నినాని స్పష్టం చేశారు. థియేటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్లు కమిటీకి ప్రతిపాదనలిచ్చారని, సినీ పెద్దల నుంచి తమకు ఇప్పటివరకు ప్రతిపాదన రాలేదని పేర్నినాని తెలిపారు. సినిమా టికెట్ ధరలపై కమిటీ రిపోర్ట్ ఇంకా రాలేదని, కమిటీ రిపోర్ట్ వచ్చాక దానిపై చర్చిస్తామని మంత్రి పేర్నినాని చెప్పారు. తమ్మారెడ్డి తనకు సమస్యను వివరిస్తే..పరిష్కరిస్తామని మంత్రి పేర్నినాని అన్నారు.