కేటీఆర్‌కి కరోనా లెక్కే కాదు:ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-04-23T20:14:07+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోవిడ్ బారిన పడడం పట్ల పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

కేటీఆర్‌కి కరోనా లెక్కే కాదు:ఎర్రబెల్లి

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోవిడ్ బారిన పడడం పట్ల పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగాన్ని అభివృద్ది చేస్తున్న మంత్రి కేటీఆర్‌కి కరోనా లెక్క కాదు. 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు, పోరాట యోధుడు, అన్నింటికీ మించి ఆత్మ స్థైర్యం, గుండె నిబ్బరం కలిగిన కేటీఆర్ని ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సాధ్యమైనంత వేగంగా మంత్రి కేటీఆర్ కోలుకోవాలని, అయన సేవల కోసం నాతో సహా, యావత్ రాష్ట్రం, దేశం ఎదురుచూస్తున్నదని అన్నారు. కాగా మంత్రి కేటీఆర్ త్వరగా కోలు కోవాలని భగవంతునికి మొక్కుకుంటున్నట్టు పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల మనిషిగా మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని అన్నారు. 

Updated Date - 2021-04-23T20:14:07+05:30 IST