నేడు జగిత్యాలలో మంత్రుల పర్యటన
ABN , First Publish Date - 2021-01-22T14:21:02+05:30 IST
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు.
జగిత్యాల: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలను మంత్రులు ప్రారంభించనున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.