శ్రీసత్యసాయి జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకం
ABN , First Publish Date - 2022-06-21T19:40:38+05:30 IST
జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. భోగినేపల్లికి చెందిన బాలికను కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు.
శ్రీసత్యసాయి: జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. భోగినేపల్లికి చెందిన బాలికను కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. బాలిక సమీప బంధువే కిడ్నాపర్గా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తెస్తూ కిడ్నాపర్ అపహరించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం నగరం తపోవనంలో కిడ్నాప్కు పాల్పడిన వ్యక్తులతో పాటు మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.