కరోనా టీకాపై అపోహలొద్దు

ABN , First Publish Date - 2021-04-24T04:30:14+05:30 IST

ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కరోనా టీకాపై ప్రజలు అపోహం పడవద్దని కరోనా వైరస్‌ నుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సిద్దవరం సర్పంచ్‌ ఆర్‌.ప్రేమలత, తహశీల్దారు శ్రీధర్‌రావు, ఎంపీడీవో వరప్రసాద్‌ కోరారు.

కరోనా టీకాపై అపోహలొద్దు

పెనగలూరు, ఏప్రిల్‌23 : ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కరోనా టీకాపై ప్రజలు అపోహం పడవద్దని కరోనా వైరస్‌ నుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సిద్దవరం సర్పంచ్‌ ఆర్‌.ప్రేమలత, తహశీల్దారు శ్రీధర్‌రావు, ఎంపీడీవో వరప్రసాద్‌ కోరారు. శుక్రవారం సచివాలయ సిబ్బందితో కలిసి ఐఎన్‌డీ సిద్దవరాలు, తిరుమలరాజుపేట, పద్మాయగారిపల్లెలో ప్రచార రఽథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. నాయకులు ఆర్‌.వెంకటేశ్వరరెడ్డి, శంకర్‌రెడ్డి, ఆర్‌ఐ హరిప్రసాద్‌, కార్యదర్శి శివసాయి పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T04:30:14+05:30 IST