ఆర్యా వాల్వేకర్‌కు మిస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటం

ABN , First Publish Date - 2022-08-08T06:05:59+05:30 IST

ప్రతిష్ఠాత్మక ’మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2022’ కిరీటాన్ని వర్జీనియాకు చెందిన ఇండియన్‌ అమెరికన్‌ యువతి ఆర్యా వాల్వేకర్‌ గెలుచుకున్నారు. శుక్రవారం జరిగిన

ఆర్యా వాల్వేకర్‌కు మిస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటం

వాషింగ్టన్‌, ఆగస్టు 7: ప్రతిష్ఠాత్మక ’మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2022’ కిరీటాన్ని వర్జీనియాకు చెందిన ఇండియన్‌ అమెరికన్‌ యువతి ఆర్యా వాల్వేకర్‌ గెలుచుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆమె.. సినీ నటి కావాలన్న తన చిరకాల కోరికను ఈ కిరీటం నెగ్గడం ద్వారా వచ్చిన  గుర్తింపుతో నెరవేర్చుకుంటానని చెప్పారు. ఈ పోటీల్లో తొలి రన్నర్‌పగా వర్జీనియాకే చెందిన సౌమ్యా శర్మ నిలవగా.. రెండో రన్నరప్‌గా రెండో రన్నరప్‌ కిరీటాన్ని సంజన చేకూరి దక్కించుకున్నారు. అలాగే, వాషింగ్టన్‌కు చెందిన అక్షిజైన్‌.. మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని దక్కించుకోగా.. న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్‌.. మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్‌ఏగా నిలిచారు. ఈ మూడు కేటగిరీల్లో విజేతలుగా నిలిచిన వాళ్లకు వచ్చే ఏడాది ముంబైలో ఇదే సంస్థ ఆధ్వర్యంలో జరిగే అందాల పోటీలకు ఆహ్వానం దక్కింది. కాగా.. న్యూయార్క్‌కు చెందిన ఇండియన్‌ అమెరికన్లు ధర్మాత్మ, నీలమ్‌ శరణ్‌.. వరల్డ్‌వైడ్‌ పాజెంట్స్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించి ఏటా ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T06:05:59+05:30 IST