మిస్‌ వైజాగ్‌ సృజితా

ABN , First Publish Date - 2021-10-13T06:27:40+05:30 IST

మిస్‌ వైజాగ్‌గా సృజితా గాలి ఎంపికయ్యారు.

మిస్‌ వైజాగ్‌ సృజితా
మిస్‌వైజాగ్‌గా నిలిచిన సృజితా గాలి (మధ్యలో యువతి)

మహారాణిపేట, అక్టోబరు 12: మిస్‌ వైజాగ్‌గా సృజితా గాలి ఎంపికయ్యారు. క్రియేటివ్‌ ప్లస్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాగర తీరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన టైటిల్‌ పోరులో 21 మంది పాల్గొన్నారు. రౌండ్లు వారీగా పోటీలో పాల్గొన్న వారి అందచందాలు, ప్రతిభా పాటవాలను అంచనా వేసిన న్యాయ నిర్ణేతలు మిస్‌ వైజాగ్‌గా కుమారి సృజితా గాలిని ప్రకటించారు. రన్నరప్‌గా కుమారి మస్కన్‌ నయ్యర్‌, మూడో స్థానంలో చరిష్మా కృష్ణ నిలిచారు. 


41 మందికి కరోనా

విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 41 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,620కు చేరింది. ఇందులో 1,55,692 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో, కొవిడ్‌ మరణాల సంఖ్య 1092కు చేరింది.

Updated Date - 2021-10-13T06:27:40+05:30 IST