త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-03T06:12:56+05:30 IST

రామారాయుడుపేట పాఠశాల భవనం శ్లాబు పెచ్చులు మంగళవారం ఊడిపడ్డాయి.

త్రుటిలో తప్పిన ప్రమాదం
బల్ల మీద పడిన శ్లాబు పెచ్చులు

ఊడిపడిన రామానాయుడుపేట పాఠశాల శ్లాబు పెచ్చులు

విద్యార్థులు లేని సమయంలో ఘటన

ఊపిరి తీసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు


మునగపాక, మార్చి 2: రామారాయుడుపేట పాఠశాల భవనం శ్లాబు పెచ్చులు మంగళవారం ఊడిపడ్డాయి. బళ్లపై పెద్ద పెచ్చు ఊడి పడడాన్ని చూసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యార్థులు తరగతి గది బయట ఉండడంతో ప్రమాదం తప్పిందని వారు ఊపిరి తీసుకున్నారు. కాగా, పాఠశాల భవనం తొలగించి కొత్త భవనం నిర్మించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ కె.వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు కొత్త భవనం నిర్మించి విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-03T06:12:56+05:30 IST