Marriage: మిస్డ్కాల్తో పరిచయం.. ప్రేమ
ABN , First Publish Date - 2022-09-09T16:25:19+05:30 IST
ఒక మిస్డ్ కాల్(Missed call) ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్ళ పోరాటం తర్వాత తల్లిదండ్రులు ఆ యువతి పెళ్ళికి
- నిశ్చితార్థం తర్వాత ఆగిన వివాహం !
అడయార్(చెన్నై), సెప్టెంబరు 8: ఒక మిస్డ్ కాల్(Missed call) ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్ళ పోరాటం తర్వాత తల్లిదండ్రులు ఆ యువతి పెళ్ళికి సమ్మతించి, నిశ్చితార్థం కూడా చేశారు. అయితే వరుడు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడంతో ఆ యువతి వరుడి ఇంటి ముందు ధర్నా చేసింది. ఈ ఘటన కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా పడందాలుమూడు అనే గ్రామంలో జరిగింది. 27 యేళ్ళ ఇంజనీరింగ్ పట్టభద్రుడు కేరళలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒక మిస్డ్ కాల్ ద్వారా నాగర్కోయిల్కు చెందిన వైద్య విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నారు. ఈ పెళ్ళికి యువతి తన తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ నెల 12న వీరి వివాహం జరగాల్సి ఉంది. వివాహ ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఇంతలో ఇరు కుటుంబాల పెద్దల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వివాహం(marriage) ఆగిపోయింది. దీంతో వైద్యురాలు వరుడు ఇంటి ముందు ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యురాలికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు.