జేసీ కుటుంబ సభ్యులకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-07-23T05:29:18+05:30 IST

లింగాలవలస సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో జాయింట్‌ కలెక్టర్‌ కుటుంబ సభ్యులకు పెద్ద ప్రమాదం తప్పింది. కారు డోర్‌ ట్రాక్టర్‌కు బలంగా తగిలి ఊడి పడింది. కారుడ్రైవర్‌ బొబ్బాదిసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జేసీ కుటుంబ సభ్యులకు తప్పిన ప్రమాదం
ప్రమాదానికి గురైన జాయింట్‌ కలెక్టర్‌ కారు

భోగాపురం, జూలై 22: లింగాలవలస సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో జాయింట్‌ కలెక్టర్‌ కుటుంబ సభ్యులకు పెద్ద ప్రమాదం తప్పింది. కారు డోర్‌ ట్రాక్టర్‌కు బలంగా తగిలి ఊడి పడింది. కారుడ్రైవర్‌ బొబ్బాదిసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, డ్రైవర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాయింట్‌ కలెక్టర్‌ కుటుంబ సభ్యులు కారులో గురువారం ఉదయం శ్రీకాకుళం బయలుదేరారు. విజయనగరం నుంచి రాజాపులోవ మీదుగా భోగాపురం, నాతవలస వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు. మార్గమధ్యలో లింగాలవలస సమీపంలో జాతీయ రహదారిపైకి వచ్చేసరికి అదే రహదారిలో పక్కనుంచి వెళ్తున్న ట్రాక్టర్‌...కారుకు బలంగా తగిలింది. ఆ తీవ్రతకు కారు డోర్‌ ఊడి రోడ్డుపై పడిపోయింది. కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.



Updated Date - 2021-07-23T05:29:18+05:30 IST