ధర్మారంలో గృహిణి అదృశ్యం

ABN , First Publish Date - 2021-05-10T05:07:11+05:30 IST

ధర్మారంలో గృహిణి అదృశ్యం

ధర్మారంలో గృహిణి అదృశ్యం
గోదాసి అనూష

గీసుగొండ, మే9: ధర్మారంలో ఓ గృహిణి అదృశ్యమైన ఘట న ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం. ధర్మారంనకు చెందిన గోదాసి రాజు వరంగల్‌లోని బట్టల దుకా ణంలో పనికి చేస్తున్నాడు.  రోజువారిలాగే  ఏప్రిల్‌ 28న రాజు పనికి వెళ్లాడు. అదేరోజు తన భార్య అనూష ఉదయం ఫోన్‌ చేసి వరంగల్‌లోని బంగారు షాపులో మాటీలు తెచ్చుకుంటాన ని చెప్పి వెళ్లింది. రాజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి భార్య కని పించలేదు. తెలిసిన కాడల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. రాజు ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-05-10T05:07:11+05:30 IST