చెరువులో బాలిక మృతదేహం, జేబులో సూసైడ్ నోట్.. విషయం ఏంటని ఆరా తీస్తే..
ABN , First Publish Date - 2022-03-10T05:49:10+05:30 IST
తమ కూతురు కనిపించడం లేదని ఈ నెల 2వ తేదీన ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మూడ్రోజుల అనంతరం ఆ బాలిక శవం ఓ చెరువులో కనిపించింది...
తమ కూతురు కనిపించడం లేదని ఈ నెల 2వ తేదీన ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మూడ్రోజుల అనంతరం ఆ బాలిక శవం ఓ చెరువులో కనిపించింది. బయటకు తీసి పోస్ట్మార్టమ్కు తరలించారు. పోస్ట్మార్టమ్లో అది సూసైడ్ కాదని తేలింది.
ఛత్తీస్గఢ్లోని చంపా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. అయితే ఇంట్లో సంబంధాలు చూస్తుండడంతో ఆ బాలిక ఆ యువకుడిపై ఒత్తిడి చేసింది. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి పెంచింది. దీంతో ఆ యువకుడు ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
ఈ నెల రెండో తేదీన ఆమెతో శృంగారం సాగించిన అనంతరం ఓ బైక్పై ఎక్కించుకుని ఊరు అవతలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఒక సుసైడ్ నోట్ రాసి మృతదేహంతో పాటు కాలువలో పడేశాడు. మృతిరాలి స్నేహితురాళ్లను దర్యాప్తు చేయగా.. ఆమె ప్రియుడి వ్యవహారం బయటకు వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.