పెళ్లి చేసుకుందామని చెప్తే ప్రియుడితో వెళ్లిన మైనర్ ప్రేయసి.. గదిలో కనిపించిన మరో యువతి.. అసలు విషయం తెలిసి మైండ్బ్లాక్.. చివరకు..
ABN , First Publish Date - 2021-10-26T12:11:55+05:30 IST
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ నగరంలో ఒక మైనర్ అమ్మాయికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. తన వాళ్లని కాదని ప్రియుడితో వెళ్లిని ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే.. గరియాబంద్ నగరానికి సమీపంలోని ఒక గ్రామంలో ఒక రోజు స్టేజి నాటక కార్యక్రమం జరిగింది. ఆ నాటకం చూడడానికి గ్రామస్తులంతా వచ్చారు. నాటకం అయిపోయాక జనమంతా వారి ఇళ్లకు వెళ్లారు కానీ ఆ గ్రామానికి చెందిన సునీత(16) అనే అమ్మాయి కనిపించకుండా పోయింది...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ నగరంలో ఒక మైనర్ అమ్మాయికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. తన వాళ్లని కాదని ప్రియుడితో వెళ్లిని ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే.. గరియాబంద్ నగరానికి సమీపంలోని ఒక గ్రామంలో ఒక రోజు స్టేజి నాటక కార్యక్రమం జరిగింది. ఆ నాటకం చూడడానికి గ్రామస్తులంతా వచ్చారు. నాటకం అయిపోయాక జనమంతా వారి ఇళ్లకు వెళ్లారు కానీ ఆ గ్రామానికి చెందిన సునీత(16) అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ రాత్రంతా సునీత కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. చివరికి చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు.
రాత్రి గ్రామంలో నాటకం చూసేందుకు తమతోపాటు వచ్చిందని సునీత వచ్చిందని, కానీ ఆ తరువాత నుంచి కనిపించడంలేదని పోలీసులకు ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. పోలీసులు సునీత కోసం గాలస్తూ ఉండగా.. ఒక రోజు సునీత తనంట తానే ఇంటికి వచ్చేసింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో?.. అసలేం జరిగిందో? తెలుసుకోవడానికి పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె చెప్పిన విషయాలు విని వారు కూడా షాకయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. సునీతకు పక్క గ్రామానికి చెందిన భాస్కర్(22) అనే యువకుడితో పరిచయం ఉంది. ఆ రోజు నాటకం జరుగుతున్న సమయంలో భాస్కర్ సునీతను ఏకాంత ప్రేదేశానికి తీసుకెళ్లాడు. ఆ తరువాత భాస్కర్ సునీతతో ఇలా అన్నాడు. "నువ్వు లేకుండా నేను ఉండలేను.. నువ్వంటే నాకు ప్రాణం. నాతో వచ్చేయ్. మా ఇంట్లో వాళ్లతో మాట్లాడాను.. వాళ్లంతా ఒప్పుకున్నారు," అని చెప్పాడు.
భాస్కర్ మాటలను నమ్మిన సునీత అతనితో వెళ్లిపోయింది. కానీ భాస్కర్ ఇంటికి చేరాక నిజం తెలుసుకొని షాకైంది. భాస్కర్ చెప్పినట్లు అతని తల్లిదండ్రులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ అతడు సునీతను తన గదికి తీసుకొని వెళ్లగా అక్కడ మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా సునీతలాగే భాస్కర్తో జీవితం పంచుకునేందుకు అక్కడకు వచ్చేసింది. భాస్కర్తో పెళ్లిచేసుకోకుండానే అతని భార్యలాగా అక్కడ ఉంటోంది. ఈ విషయం సునీతకు తెలుసుకొని షాక్కు గురైంది. ఆ తరువాత భాస్కర్ సునీతకు ఇష్టం లేకపోయినా ఆమెపై బలవంతం చేశాడు. సమయం చూసి సునీత అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది.
సునీత ఒక మైనర్ కావడంతో పోలీసులు భాస్కర్ని అరెస్టు చేశారు. అతనితో ఉన్న మరో అమ్మాయి గురించి భాస్కర్ను ప్రశ్నించారు. ఆ అమ్మాయి తన మరదలు(మేనమామ కూతురు) అని, తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా ఆమెతో పెళ్లిచేసేందుకు నిర్ణంయించారని భాస్కర్ చెప్పాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తన మరదలని ఇంట్లోనే తన భార్యలాగా ఉండమని తీసుకొచ్చారని తెలిపాడు. కానీ తనకు సునీతంటే ఇష్టమని, అందుకే ఆమెను ఇంటికి తీసుకెళ్లానని చెప్పాడు.
ప్రస్తుతం భాస్కర్పై ఒక మైనర్ని కిడ్నాప్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.