మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2022-07-28T17:39:31+05:30 IST

ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. బాలానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల సుభాష్‌నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద

మహిళ అదృశ్యం

హైదరాబాద్/బాలానగర్‌: ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. బాలానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల సుభాష్‌నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద నివాసముండే వంగ శ్రీనివాస్‌ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.  భర్త మరణంతో  భార్య వంగదుర్గ(42) అనారోగ్యం బారిన పడింది. ఆమె కొన్ని రోజులుగా మందులు వాడడం మానేసిందని,  అప్పటినుంచి ఆమె ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి వస్తుండేది. ఈనెల 26న ఇంటి ఎదురుగా  నిర్మాణం జరుగుతున్న  వారి కారులో వెళ్లి బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తాలో దిగి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పోయి ఇంతవరకు తిరిగి రాలేదు. ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు వంగ జాషువా పోలీసులకు బుధవారం సాయంత్ర ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Updated Date - 2022-07-28T17:39:31+05:30 IST