మిషన్ భగీరథ స్థిరీకరణ నెలలో పూర్తి: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-09-29T08:08:11+05:30 IST
మిషన్ భగీరథ స్థిరీకరణ నెలలో పూర్తి: ఎర్రబెల్లి
హైదరాబాద్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ స్థిరీకరణ పనులను అక్టోబరు 15కు 80ు, 30లోగా 100ు పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయకర్రావు ఆదేశించారు. సౌర విద్యుత్తుద్వారా ప్రభుత్వం గుర్తించిన 126 మారుమూల గ్రామాలకు నవంబరు 30లోగా తాగునీరు అందించాలని సోమవారం సమీక్ష సమావేశంలో నిర్దేశించారు. సింగూరు ఆధారిత ప్రాజెక్టు కింద ఉండటం వల్ల 1,607 ఆవాసాల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.