బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకానికి మళ్ళీ కసరత్తు

ABN , First Publish Date - 2021-04-12T17:18:31+05:30 IST

బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకానికి మళ్ళీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకానికి మళ్ళీ కసరత్తు

అమరావతి: బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకానికి మళ్ళీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో నోటిఫికేషన్ ఇస్తే.. దానిపై కోర్టులో కేసులు వేయగా.. మిగిలిన భూమి విషయంలో ఇప్పుడు అమ్మకాలకు సిద్ధమైంది. బిల్డ్ ఏపీ పేరుతో లోలోపల విలువైన భూముల అమ్మకాలకు పావులు కదుపుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు ప్రభుత్వ పన్నాగాలను పసిగట్టిన విపక్షాలు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు కావాలి. ఆ నిధులను సమకూర్చుకునేందుకు భూములమ్మేందుకు సిద్ధమైంది.   

Updated Date - 2021-04-12T17:18:31+05:30 IST