మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌కు Tamilnadu యువకుడు

ABN , First Publish Date - 2022-05-28T16:22:20+05:30 IST

థాయిలాండ్‌ వేదికగా జరుగనున్న నాలుగో ఎడిషన్‌ మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌ పోటీలకు రాష్ట్రానికి చందిన శరత్‌ మనోహరన్‌ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో భారత్‌తో

మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌కు Tamilnadu యువకుడు

అడయార్‌(చెన్నై): థాయిలాండ్‌ వేదికగా జరుగనున్న నాలుగో ఎడిషన్‌ మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌ పోటీలకు రాష్ట్రానికి చందిన శరత్‌ మనోహరన్‌ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, బ్రెజిల్‌, జర్మనీ, మలేసియా, ఫ్రాన్స్‌, పాకిస్తాన్‌ సహా 25కు పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఈ నెల 29 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో ఫిట్నెస్‌, టాలెంట్‌, స్టైలింగ్‌, యాటిట్యూడ్‌, బిహేవియర్‌, డిజైనర్‌ వాల్క్‌, స్మిమ్‌వేర్‌ వాల్క్‌, చివరగా టెక్సెడో, క్యూ అండ్‌ ఏ రౌండ్‌ ఉంటుంది. కాగా, శరత్‌ మనోహరన్‌ గోవా వేదికగా 2020-21లో జరిగిన రుబరు మిస్టర్‌ సౌత్‌ ఇండియాగా నిలిచాడు. ఇపుడు మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌ పోటీలకు సిద్ధమవుతున్నాడు.

Updated Date - 2022-05-28T16:22:20+05:30 IST