క్రీడలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-09-01T22:29:22+05:30 IST

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో క్రీడల పురోగతికి ప్రోత్సాహం అందిస్తున్నారని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

క్రీడలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం  కేసీఆర్ ఆధ్వర్యంలో క్రీడల పురోగతికి ప్రోత్సాహం అందిస్తున్నారని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం గారు హైదరాబాద్ లోని తన నివాసంలో 'సై స్పోర్ట్స్' పేరుతో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఛానల్ లోగో ను ఆవిష్కరించారు. తెలుగులో స్పోర్ట్స్ కోసం ప్రత్యేక న్యూస్ ఛానల్ ను తీసుకరావడం పట్ల ఛానల్ యాజమాన్యం ను మంత్రి అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. క్రీడాకారులను, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-09-01T22:29:22+05:30 IST