నిర్మాణంలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటాం:ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-10T05:08:39+05:30 IST

నిర్మాణంలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటాం:ఎమ్మెల్యే

నిర్మాణంలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటాం:ఎమ్మెల్యే
గూడెప్పాడ్‌లో డబుల్‌బెడ్‌రూంలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఆత్మకూరు, మే 9: డబుల్‌ బెడ్‌ రూంల నిర్మా ణంలో జాప్యం జరిగితే ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం గూడెప్పాడ్‌లో 99డబుల్‌ బెడ్‌రూం గృహాలను ఇంజనీరింగ్‌ ఆధికా రులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.  నిర్మాణం పనులు వేగవంతంగా చేయాలని  ఎమ్మెల్యే ఆదే శించారు. నెల రోజుల లోపు అన్ని పనులు పూర్తి చేసి అందించే బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, పీఆర్‌ ఏఈ క్రిష్టయ్య, కాంట్రాక్టరు జనగాం సాంబయ్య, సర్పంచ్‌ బీరం శ్రీలత పాల్గొన్నారు. నిరుపేదలందరికీ డబుల్‌బెడ్‌రూంలు సకల సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసి అందిస్తామని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం కటాక్షపురంలో నిర్మాణం చివరి దశలో ఉన్న డబుల్‌బెడ్‌ రూంలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, సర్పంచ్‌లు మచ్చిక యాదగిరిగౌడ్‌, ఎస్‌కె రబీయాబీ, పీఆర్‌ ఏఈ క్రిష్టయ్య, మండల పార్టీ అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు అర్షం వరుణ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T05:08:39+05:30 IST