చెక్డ్యామ్లను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-05-11T05:54:20+05:30 IST
చెక్డ్యామ్లను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
నర్సంపేట, మే 10 : నియోజకవర్గంలో చేపట్టిన చెక్డ్యామ్ల నిర్మాణ పనులను జూన్ 15 వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణ శివారులోని చెక్డ్యామ్ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ శాఖ ల వారీగా ఏ పని ఎప్పటి వరకు పూర్తవుతుందో వెంటనే నివేదిక తయారుచేయాలని సూచించారు. ఇరిగేషన్కు సంబంధించిన పాఖాల వాగుపై మున్నేరువాగు, మాధన్నపేటవాగుపై, నెక్కొండ మండలంలోని వట్టెవాగుపై 13 చెక్డ్యామ్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ 13 చెక్డ్యామ్లలో 4 చెక్డ్యామ్ల నిర్మాణ పనులు పూర్తిదశకు చేరినట్లు తెలిపారు. మిగిలిన చెక్డ్యామ్ల పనులను జూన్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.