మానసికోల్లాసానికి క్రీడలు దోహదం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-03-07T04:57:19+05:30 IST
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం: ఎమ్మెల్యే
వర్ధన్నపేట, మార్చి 6 : మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. శనివారం ఇల్లందలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో ఐకమత్యం, ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో క్రీడా కోటాలో సీట్లు కేటాయించబడతాయని, యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. అరూరి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కమిషనర్ జి.రవీందర్ గౌడ్, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏసీపీ రమేష్, సర్పంచ్లు సాంబయ్య, సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.