Eluru జిల్లాలో అభివృద్ధి Pawanకు కనపడటం లేదా?: Alla Nani

ABN , First Publish Date - 2022-07-06T21:13:06+05:30 IST

ఏలూరు జిల్లాలో అభివృద్ధి పవన్ కల్యాణ్‌కు కనపడటం లేదా? అని ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రశ్నించారు.

Eluru జిల్లాలో అభివృద్ధి Pawanకు కనపడటం లేదా?: Alla Nani

ఏలూరు (Eluru) జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు ఏలూరు జిల్లాలో అభివృద్ధి కనపడటం లేదా? అని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (Alla Nani) ప్రశ్నించారు. ఏలూరులో జరుగుతున్న ప్లీనరీ (Plenary) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ విరాళాలు సేకరించిన డబ్బుతో చనిపోయిన కౌలు రైతుకు రూ. లక్ష ఇస్తే.. తాము రూ. 7 లక్షలు ఇచ్చామని చెప్పారు. పవన్ ముసలి కన్నీరు కార్చి.. ఒక లక్ష ఇచ్చి తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ (TDP) కార్యకర్తలతో మాట్లాడించి పధకాలు అందలేదని చెప్పించి గొడవలు సృష్టించారని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) ఆవినీతి వల్లే పోలవరం ప్రాజెక్ట్ (Polavaram project) నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమని అన్నారు. చంద్రబాబు పరిపాలన సక్రమంగా చేయకుండా వైసీపీ  ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుష్టచతుష్టయం కలిసిన జగన్‌ను ఏమి చేయలేరని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు.

Updated Date - 2022-07-06T21:13:06+05:30 IST