టీడీపీ హయాంలో పంచభూతాలను దోచుకున్నారు: ఎమ్మెల్యే అమర్నాథ్
ABN , First Publish Date - 2021-07-10T03:01:45+05:30 IST
టీడీపీ హయాంలో పంచభూతాలను దోచుకున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
విశాఖ: టీడీపీ హయాంలో పంచభూతాలను దోచుకున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ చేసింది టీడీపీయేనని అమర్నాథ్ పేర్కొన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత లేటరేట్ తవ్వకాలకు అనుమతులివ్వలేదన్నారు. అక్రమ మైనింగ్ జరిగిందని టీడీపీ నిర్ధారణ కమిటీ హడావిడి చేస్తోందని ఆయన విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఎమ్మెల్యే అమర్నాథ్ స్పష్టం చేశారు.