సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ

ABN , First Publish Date - 2021-05-09T17:37:06+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు.

సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రెండేళ్లుగా అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, పాత్రికేయులపై కక్షసాధింపు వైఖరి తగదన్నారు. జర్నలిస్టులను కోవిద్ వారియర్స్‌గా గుర్తించాలని, మృతిచెందిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారికి రూ. 2లక్షల సహాయం అందించాలని, జర్నలిస్టులందరికీ రూ.20 వేల తక్షణ సాయం అందించాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-09T17:37:06+05:30 IST