Telangana news: కేంద్రం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోంది: ఆరూరి రమేష్
ABN , First Publish Date - 2022-07-20T17:41:14+05:30 IST
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శించారు.
వరంగల్ (Warangal): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పాలనపై కూడా జీఎస్టీ పెంచడం దారుణమన్నారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తెలంగాణ (Telangana)పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరూరి రమేష్ మండిపడ్డారు.