ఎన్ని కష్టాలొచ్చినా.. స్నేహితుడు ఒక్కడుంటే చాలు: ఎమ్మెల్యే బాలరాజు

ABN , First Publish Date - 2022-03-21T02:26:25+05:30 IST

ఎన్ని కష్టాలు వచ్చినా స్నేహితుడు ఒక్కడుంటే.. అన్నింటినీ సునాయాసంగా ఎదుర్కోవచ్చని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఆదివారం ..

ఎన్ని కష్టాలొచ్చినా.. స్నేహితుడు ఒక్కడుంటే చాలు: ఎమ్మెల్యే బాలరాజు

బుట్టాయగూడెం (పశ్చిమగోదావరి): ఎన్ని కష్టాలు వచ్చినా స్నేహితుడు ఒక్కడుంటే.. అన్నింటినీ సునాయాసంగా ఎదుర్కోవచ్చని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులోని ఎమ్మెల్యే నివాసంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1991లో ఎమ్మెల్యేతో పాటూ పదో తరగతి చదివిన మిత్రులంతా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.


ఈ సందర్భంగా మిత్రులతో ఎమ్మెల్యే సరదాగా మాట్లాడుతూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న నాటి మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్ని స్నేహాలున్నా.. బాల్య స్నేహం ఎప్పటికీ గుర్తు ఉంటుందని చెప్పారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తనను సంప్రదించవచ్చని స్నేహితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - 2022-03-21T02:26:25+05:30 IST