‘నా మాటలు వైసీపీ పార్టీకి, సిఎంవో కార్యాలయంకు సంబంధం లేదు’

ABN , First Publish Date - 2021-07-26T02:13:33+05:30 IST

‘నా మాటలు వైసీపీ పార్టీకి, సిఎంవో కార్యాలయంకు సంబంధం లేదు’

‘నా మాటలు వైసీపీ పార్టీకి, సిఎంవో కార్యాలయంకు సంబంధం లేదు’

కర్నూలు: గోవధ నిషేధంపై నిన్న తాను మాట్లాడిన మాటలు వైసీపీకి, సీఎంవో కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి తెలిపారు. తాను హిందుమతానికి వ్యతిరేకంగా పని చేస్తున్నానని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను పక్కా హిందువునని, హిందు దేవుళ్లనే కొలుస్తానని ఆయన స్పష్టం చేశారు. మైనార్టీలపై బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలను వ్యతిరేకించే బీజేపీ గోవును అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను పరిపాలించాలని చూస్తోందని చెన్న కేశవ రెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2021-07-26T02:13:33+05:30 IST