Danam nagender: బండి సంజయ్ గల్లీ లీడరా ...జాతీయ పార్టీకి అధ్యక్షుడా

ABN , First Publish Date - 2022-08-17T16:33:01+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma gandhi)ని చంపిన గాడ్సేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ గాంధీకి మాత్రం గౌరవం దక్కట్లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagender) అన్నారు.

Danam nagender: బండి సంజయ్ గల్లీ లీడరా ...జాతీయ పార్టీకి అధ్యక్షుడా

హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma gandhi)ని చంపిన గాడ్సేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ గాంధీకి మాత్రం గౌరవం దక్కట్లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagender) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi snajay) గల్లీ లీడరా... జాతీయ పార్టీకి అధ్యక్షుడా అని ప్రశ్నించారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారన్నారు. బండి సంజయ్ అన్ని అబద్ధాలే మాట్లాడుతారని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా మారారన్నారు. బండి సంజయ్ కేసీఆర్‌ (KCR)పై పిచ్చి మాటలు మానాలని హితవుపలికారు. బండి సంజయ్ ఓ తుగ్లక్ అని అన్నారు. కేంద్ర నిధులపై గోడలపై రాసుకోవటం కాదని... గుండు మీద రాసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. మోదీ (Narendra modi)కి కుటుంబమే లేదని... కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత లేదని దానం నాగేందర్ అన్నారు. 

Updated Date - 2022-08-17T16:33:01+05:30 IST