కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి
ABN , First Publish Date - 2022-08-15T06:38:40+05:30 IST
కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ అనంతగిరి మండల అధ్యక్షుడు గింజుపల్లి రమేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు అన్నారు.
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, ఆగస్టు 14: కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ అనంతగిరి మండల అధ్యక్షుడు గింజుపల్లి రమేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పుట్టినరోజు వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అదేవిధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్నదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్, శ్రీనివాసరావు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుంద న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- అనంతగిరిలో శనగల రాధాకృష్ణ అనాథాశ్రమంలో మండలంలో బొజ్జగూడెం గ్రామానికి చెందిన ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుగులోతు శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు భూక్యా రవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు కొండా సైదయ్య, నల్లబోలు శ్రీనివాస్రెడ్డి, నాయకులు రమణ నాగయ్య, దొడ్డా సురేష్, కస్తూరి నర్స య్య, అల్సకాని జనార్దన్, బట్టు శివాజీ, గన్నా అశోక్, పాషా, నాగరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- ఎమ్మెల్యె బొల్లం మల్లయ్య యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా మోతె మండల కేంద్రంతో పాటు సర్వారం, రావిపహడ్, మోతె గ్రామాల్లో కేక్కట్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు, ఏలూరి వెంకటే శ్వరరావు, సర్పంచ్లు రమేష్, ఇందిరా, శ్రీనివాస్రెడ్డి, కాంపాటి వెంకన్న, శ్రీధర్రెడ్డి, పల్స మల్సూరు, శ్రీనుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, అధ్యక్షు పాల్గొన్నారు.
- కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పుట్టినరోజు వేడుకలను ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచా యతీ ఆవరణలో గ్రామస్థుల నడుమ కేక్కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి హరితహారం నిర్వహించారు. కార్యక్ర మంలో సొసైటీ డైరెక్టర్ శెట్టి శ్రీనివాసరావు, గ్రామశాఖ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ నబీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, శిరంశెట్టి నాగేశ్వరరావు, మిర్యాల బుచ్చయ్య, షేక్ మస్తాన్, సుదర్శన్, మిరియాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గుడిబండ గ్రామంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.