యువతి వివాహానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం

ABN , First Publish Date - 2022-05-27T07:22:14+05:30 IST

తండ్రి మృతి చెందగా అతడి కుమార్తె వివాహానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.లక్ష ఆర్థికసాయం చేసి మానవత్వం చాటారు.

యువతి వివాహానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం
చెక్కును అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సంస్థాన్‌ నారాయణపురం, మే 26: తండ్రి మృతి చెందగా అతడి కుమార్తె వివాహానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.లక్ష ఆర్థికసాయం చేసి మానవత్వం చాటారు.  సంస్థాన్‌ నారాయణ పురం మండలంలోని సర్వేల్‌ గ్రామానికి చెందిన సుక్క రవి, వనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రవి అనా రోగ్యంతో గతంలో మృతి చెందాడు.  కుమార్తె మైత్రి వివాహానికి మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.లక్ష రూపాయలు పంపారు. గురువారం ఈ నగదును కల్యాణ మండపంలో  కాంగ్రెస్‌ పార్టీ మండల అఽధ్యక్షుడు కరంటోతు శ్రీను వధువు మైత్రికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు షేక్‌ షబ్బీర్‌, గుత్తా శ్రీధర్‌రెడ్డి, గుత్త శేఖర్‌రెడ్డి, బక్కులు, రాజు, యాదయ్య, మల్లయ్య ఉన్నారు.  



Updated Date - 2022-05-27T07:22:14+05:30 IST