మోదీ పేరు ఎత్తని పిరికిపంద చంద్రబాబు: అమర్‌నాధ్

ABN , First Publish Date - 2021-03-06T22:06:32+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఎత్తని పిరికిపంద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్ అన్నారు.

మోదీ పేరు ఎత్తని పిరికిపంద చంద్రబాబు: అమర్‌నాధ్

విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఎత్తని పిరికిపంద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్ అన్నారు. శనివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ..విశాఖ అభివృద్ధికి చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ఏ హక్కుతో విశాఖకి వచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు.పరిపాలన రాజధాని వ్యతిరేకించే వారికి ఇక్కడ ఓటుని అడిగే హక్కు  ఉందా? అని ప్రశ్నించారు.ఇల్లు, ఇళ్ల పట్టాలను తెలుగుదేశం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకొడులు విశాఖ వచ్చి బూతులు మాట్లాడుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి తండ్రీ కొడుకుల శనిదయ్యం పట్టుకుందని అమర్‌నాధ్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-03-06T22:06:32+05:30 IST