రేవంత్, ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-03-20T18:50:33+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలు జరగడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

రేవంత్, ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలు జరగడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ నిర్ణయాలకు ఠాగూర్ ఆమోదం తెలుపుతున్నారని, సీనియర్ల మీద బురద జల్లుతున్నారన్నారు. తాను పార్టీ మారతానని అధిష్టానానికి తప్పుడు నివేదక ఇచ్చారన్నారు. కష్టాల్లో ఉండి కూడా పార్టీ మారలేదని.. తనపై ప్రచారం చేసే వారికి బుద్ది ఉండాలన్నారు. వీహెచ్ ఆహ్వానిస్తే సమావేశానికి వచ్చానని, తాను ఎవరి దయా దాక్షిన్యాలతో రాజకీయాలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్, సోనియా గాంధీలే బాస్‌లని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-20T18:50:33+05:30 IST