కలెక్టర్లు బలిసి మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-10-28T22:43:01+05:30 IST

కలెక్టర్లు బాగా బలిసి రైతుల మీద మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్

కలెక్టర్లు బలిసి మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్: కలెక్టర్లు బాగా బలిసి రైతుల మీద మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు డ్రామాలు బంద్ చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల పక్షాన కాంగ్రెస్  పోరాడుతుందని ఆయన ప్రకటించారు. నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామన్నారు.  ప్రతిపక్షాలను మంత్రులు రండలు అని తిట్టొచ్చా అని ఆయన ప్రశ్నించారు. రైతుల పక్షాన మాట్లాడితే తాము రండలమా అని ఆయన నిలదీసారు. మరి మీరు కేసీఆర్ కోసం రండలా అని ఆయన ప్రశ్నించారు. రైతుల కోసం తాము తిట్లు తినడానికి సిద్ధమన్నారు.


రైతుల పొట్టకొడితే మంత్రులు, కలెక్టర్ల వీపులు పలుగుతాయని ఆయన హెచ్చరించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఓ చిల్లరగాడని ఆయన ఎద్దేవా చేసారు. వరి ధార్యం కొనకపోతే మంత్రులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మరొకసారి తమను రండలు అంటే నాలుక కోస్తామని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్‌రెడ్డిలు తమ నోరును అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. లేదంటే నడిరోడ్డుమీద వారివి బట్టలు విప్పిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-28T22:43:01+05:30 IST