ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది: ఎమ్మెల్యే Bhupal

ABN , First Publish Date - 2021-11-15T17:17:33+05:30 IST

రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.

ప్రతీ గింజను  ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది: ఎమ్మెల్యే Bhupal

నల్లగొండ: రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటల విద్యుత్, పుష్కలంగా నీరు ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. వచ్చే యాసంగిలో ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని బండి సంజయ్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ పురుగు తెలంగాణకు వచ్చిందని... మందులు వేసి చావగొట్టాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-11-15T17:17:33+05:30 IST