కొవిడ్‌ వార్డును మరోమారు సందర్శించిన ఎమ్మెల్యే కంచర్ల

ABN , First Publish Date - 2021-05-09T05:52:13+05:30 IST

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మరో మారు శనివారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులో సందర్శించా

కొవిడ్‌ వార్డును మరోమారు సందర్శించిన ఎమ్మెల్యే కంచర్ల
కొవిడ్‌ రోగితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్లగొండ టౌన, మే 8 : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మరో మారు శనివారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులో సందర్శించారు. కొవిడ్‌ వార్డంతా కలియతిరిగి 190మంది కరోనా బాధితుల యోగక్షేమాలు అడిగి తె లుసుకున్నారు. బాధితుల భుజం తట్టి వారిలో ధైర్యం నింపారు. అనంతరం ఆస్పత్రిలో కనోనా రోగులకు అందుతున్న వైద్యంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కోవిడ్‌ బారిన పడిన వారు ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగెత్తకుండా అన్ని వసతులు ఆక్సిజనతో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జైసంహా రాథోడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్‌  ఉన్నారు.


Updated Date - 2021-05-09T05:52:13+05:30 IST