అయ్యన్నను ఎక్కడ పెట్టగలమో అక్కడ పెడతాం: ఎమ్మెల్యే కరణం
ABN , First Publish Date - 2021-09-18T17:19:08+05:30 IST
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు.
విశాఖపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడి అక్రమ వ్యాపారులు అన్ని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెడతామని తెలిపారు. రంగురాళ్లు వ్యాపారంలో వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టారని... ఆ ఇల్లుకు ప్లాన్ కూడా తీసుకోలేదన్నారు. అయ్యన్నను ఎక్కడ పెట్టగలమో అక్కడ పెడతామని ఆయన అన్నారు. య్యన్నపాత్రుడు గంజాయి దొంగ అని...తాగుబోతు తాతజి అని వ్యాఖ్యానించారు. పెగ్గు, లెగ్గు లేకపోతే అయ్యన్నపాత్రుడుకి నిద్రపట్టదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు క్షమపణ చెప్పకపోతే నర్సీపట్నం ప్రజలు తగిన బుద్దిచెబుతారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హెచ్చరించారు.