షర్మిళ దీక్షకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంఘీబావం

ABN , First Publish Date - 2021-07-27T22:47:54+05:30 IST

జిల్లాలోని చండూరు ‌మండలంలోని పుల్లెంలలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ నిరాహార

షర్మిళ దీక్షకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంఘీబావం

నల్గొండ: జిల్లాలోని చండూరు ‌మండలంలోని పుల్లెంలలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిళ నిరాహార నిరుద్యోగ దీక్ష చేపట్టారు. షర్మిళకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంఘీబావం ప్రకటించారు. ఢిల్లీ నుంచి ఆయన ఫోన్లో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి  మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలపై పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ ఉద్యమ‌కారుల‌ను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ పోరాటంలో షర్మిళ స‌ఫ‌లీకృతం కావాలన్నారు. రాజ‌న్న బిడ్డ‌గా షర్మిళ అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉందన్నారు. షర్మిళకు తన పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగాలను నింపడం వ‌దిలేసి కుటుంబం కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి  విమర్శించారు. 

Updated Date - 2021-07-27T22:47:54+05:30 IST