మహిళా corporatorపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే Mainampalli
ABN , First Publish Date - 2022-06-15T18:11:41+05:30 IST
టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే మైనంపల్లి మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు.
Hyderabad: టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mainampalli Hanumantrao) మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు. ‘నీ క్యారెక్టర్ నాకు తెలుసు’ అంటూ మహిళా కార్పొరేటర్ (women corporator)పై నోరు పారేసుకున్నారు. మౌలాలీ 138 డివిజన్లోని గణేష్నగర్లో రోడ్డు నిర్మాణం పనులను స్థానిక కార్పొరేటర్ సునీతా శేఖర్ యాదవ్ ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే శాంక్షన్ చేయించిన పనులకు కార్పొరేటర్ ప్రారంభిస్తున్నారని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యే తొత్తులుగా మారి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సునీతా మండిపడ్డారు.
కార్పొరేటర్ సునీతా వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే మైనంపల్లి వ్యక్తి గత విమర్ళలు చేశారు. ‘నీ క్యారెక్టర్ నాకు తెలుసు’ అని నోరు పారేసుకున్నారు. అయితే మైనంపల్లి వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు నోటీ దురుసును ప్రదర్శించారు.