ఎక్కడా ఒక్క గుంత కూడా ఉండటానికి వీల్లేదు: Malladi vishnu

ABN , First Publish Date - 2021-12-08T17:04:18+05:30 IST

రాష్ట్రంలో రహదారులకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

ఎక్కడా ఒక్క గుంత కూడా ఉండటానికి వీల్లేదు: Malladi vishnu

విజయవాడ: రాష్ట్రంలో రహదారులకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం నూజివీడు ప్రధాన రహదారి పైపుల రోడ్డు సెంటర్ నుంచి నున్న బైపాస్ జంక్షన్ వరకు రూ. 2 కోట్ల 50 లక్షల నిధులుతో పునఃనిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు కంటే సీఎం జగన్ ఎక్కువ రోడ్లు వేయించారన్నారు. ఎక్కడా ఒక్క గుంత కూడా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. నాడు-నేడు తరహాలో రోడ్లు మరమ్మతులు చేసిన తర్వాత ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపించాలన్నారు. వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 

Updated Date - 2021-12-08T17:04:18+05:30 IST