MLA హత్యకు కుట్ర కేసులో ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-12-11T18:31:11+05:30 IST
బెంగళూరు యలహంక బీజేపీ ఎమ్మెల్యే, బెంగళూరు అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు ఎస్ ఆర్ విశ్వనాథ్ను హతమార్చే కుట్ర పన్నిన కేసుకు సంబంధించి ఐదుగుర్ని అరెస్టుచేసి విచారణ జరుపుతున్నట్లు
బెంగళూరు: బెంగళూరు యలహంక బీజేపీ ఎమ్మెల్యే, బెంగళూరు అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు ఎస్ ఆర్ విశ్వనాథ్ను హతమార్చే కుట్ర పన్నిన కేసుకు సంబంధించి ఐదుగుర్ని అరెస్టుచేసి విచారణ జరుపుతున్నట్లు రాజానుకుంటె పోలీసులు ప్రకటించారు. అరెస్టయిన వారిలో స్థానిక కాంగ్రెస్ నేత గోపాలకృష్ణతో పాటు కుళ్ళదేవరాజ్, ధర్మ, మంజునాధ్, నవీన్కుమార్ ఉన్నారు. వీరి మొబైల్ ఫోన్ల సంభాషణలను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేపై హత్య కుట్రకు సంబంధించి ఇటీవల విడుదలైన కొన్ని వీడియాలు పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. కాగా ఇప్పటికే ఎమ్మెల్యే నివాసం వద్ద అదనపు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసు విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ నేతలపై కేసులు దాఖలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ చర్యలను రాజకీయంగానే ఎదుర్కొంటామని ప్రకటించింది.