క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-04-21T05:20:48+05:30 IST

నగరంలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా బాధితులకు పాతగుంటూరులో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా మంగళవారం పరిశీలించారు

క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాట్ల పరిశీలన
అధికారులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా, జియావుద్దీన్‌ తదితరులు

గుంటూరు, ఏప్రిల్‌ 20: నగరంలో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా బాధితులకు పాతగుంటూరులో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా మంగళవారం పరిశీలించారు. పాతగుంటూరు పార్కు రోడ్డులో కాపు భవనం ఖాళీగా ఉండటంతో కరోనా బాదితులకు క్వారంటైన్‌తో పాటు ప్రాఽథమిక చికిత్స అందించటానికి శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమస్య తీవ్రతను బట్టి బాధితులను అత్యవసర వైద్యానికి జీజీహెచ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం జియావుద్దీన్‌, జీఎంసీ అధికారులు శాంతిరాజు, ప్రసాద్‌, దుర్గాప్రసాద్‌లతో పాటు వైసీపీ నాయకులున్నారు. 

 

Updated Date - 2021-04-21T05:20:48+05:30 IST