వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు తప్పనిసరి: ఎమ్మెల్యే నాగార్జున
ABN , First Publish Date - 2021-01-17T14:02:11+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా..
కొల్లూరు(గుంటూరు): కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. శనివారం కొల్లూరు పీహెచ్సీలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు తమ వంతు సేవలందించారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జాన్పీటర్, ఎంపీడీవో ఐ.సత్యనారాయణరావు, వైద్యుడు రవిబాబు, ఈవోపీఆర్డీ వరూధిని, సీడీపీవో అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
చుండూరు పీహెచ్సీలో 72 మందికి వ్యాక్సినేషన్
చుండూరు: కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రభుత్వం సమర్ధవంతంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున తెలిపారు. శనివారం చుండూరు పీహెచ్సీ వద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రానికి మొత్తం 85 వ్యాక్సినేషన్లు అందగా 72 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. మండల అధికారులు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.