మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే నాగార్జున

ABN , First Publish Date - 2020-10-27T18:23:36+05:30 IST

రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే నాగార్జున

గుంటూరు: రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని.. దానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణ జరుగుతుందన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకు వచ్చే నెలలో నష్టపరిహారం అందిస్తామన్నారు. లైలా తుఫాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదన్నారు. రైతులను ఉదారంగా ఆదుకునే ప్రభుత్వం ఇది అని నాగార్జున స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-27T18:23:36+05:30 IST