YCP Governmentపై పెద్ద ఎత్తున విరుచుకు పడిన ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2022-09-20T17:28:34+05:30 IST

చింతూరు (Chintur)లో సంధ్య అనే అమ్మాయి స్థానికంగా వైద్యం అందక భద్రాచలం (Bhadrachalam)లో చనిపోయిందని

YCP Governmentపై పెద్ద ఎత్తున విరుచుకు పడిన ఎమ్మెల్యే నిమ్మల

Amaravathi : చింతూరు (Chintur)లో సంధ్య అనే అమ్మాయి స్థానికంగా వైద్యం అందక భద్రాచలం (Bhadrachalam)లో చనిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (TDP MLA Nimmala Ramanaidu) పేర్కొన్నారు. అసెంబ్లీ(AP Assembly)లో విష జ్వరాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో డెంగ్యూ(Dengue) వల్ల ఎనిమిది మంది చనిపోయారని నిమ్మల పేర్కొన్నారు. గతంలో ఫాగింగ్, స్ప్రే చేసేవారని.. కానీ ఇప్పుడు అవి లేవన్నారు. చెత్త పన్ను వేస్తున్నారని.. కానీ చెత్త తీసుకు వెళ్ళడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ (Arogya Sri)లో విషజ్వారాలు చేర్చామంటున్నారని... అయితే అది వెంటిలీటర్ (Ventilator) మీదుకు వెళితేనే వర్తిస్తుంది అంటున్నారన్నారు. ప్లేట్ లెట్స్ దోరక్కపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-20T17:28:34+05:30 IST