కాటన్ అన్నం పెడితే...జగన్ సున్నం పెడుతున్నారు: నిమ్మల
ABN , First Publish Date - 2021-05-15T17:15:14+05:30 IST
కాటన్ 218వ జయంతిని పురష్కరించుకొని పాలకొల్లు లాకు సెంటర్ వద్ద కాటన్ దొర విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు.
ఏలూరు: కాటన్ 218వ జయంతిని పురష్కరించుకొని పాలకొల్లు లాకు సెంటర్ వద్ద కాటన్ దొర విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు కాటన్ అన్నం పెడితే నేడు జగన్ సున్నం పెడుతున్నాడని విమర్శించారు. పంట పండించడం కంటే ధాన్యాన్ని అమ్ముకోవడానికి కౌలు రైతు కష్టపడవలసి వస్తుందన్నారు. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే అని అన్నారు. రైతు భరోసాలో కౌలు రైతులకు మొండి చెయ్యిచూపారని నిమ్మల రామానాయుడు విమర్శించారు.