డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ ఎందుకు వెనకాడుతున్నారు?: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2020-09-23T18:25:12+05:30 IST

తిరుమల ఆచార వ్యవహారాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు వెనుకాడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ ఎందుకు వెనకాడుతున్నారు?: ఎమ్మెల్యే నిమ్మల

ఏలూరు: తిరుమల ఆచార వ్యవహారాల ప్రకారం  డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు వెనుకాడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. హిందు మత సంస్థలపై దాడులు, అన్యమతస్థులు  తిరుమల దర్శనానికి  డిక్లరేషన్ అవసరం లేదన్న టీటీడీ ప్రకటనకు నిరసన పాలకొల్లు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ మత ఆచారం ప్రకారం సతీసమేతంగా తిరుమల దర్శనం చేసుకోవడానికి జగన్‌కు ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వెంకన్న దర్శనార్ధం సనాతన ఆచారాన్ని ధిక్కరించి డిక్లరేషన్ ఇవ్వను అంటే ఎలా అని నిలదీశారు. 16 నెలల పాలనలో హిందూ ధర్మ క్షేత్రాలు,  సంస్థలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-23T18:25:12+05:30 IST