Eluru: కుటుంబసమేతంగా నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2021-12-13T16:05:07+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కుటుంబసమేతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

Eluru: కుటుంబసమేతంగా నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా  పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎమ్మెల్యే నిమ్మల  రామానాయుడు  కుటుంబసమేతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని,  అందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ... జగన్ పాలనలో ఇల్లు లేదు, బిల్లు లేదు, ఆఖరికి కట్టిన ఇల్లు కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. నాడు పాదయాత్రలో టిడ్కో ఇళ్ళు పూర్తి ఉచితంగా ఇస్తానని జగన్ చెప్పారని... నేడు  బ్యాంకులలో రుణాలు తీసుకోమని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మూడు సంవత్సరాల పాలనలో కట్టిన ఇళ్ళు పూర్తి చేసే సత్తా లేదన్నారు. కానీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదులో సత్తా చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘నా ఇల్లు నా సొంతం’’ ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని,  టిడ్కో ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-13T16:05:07+05:30 IST