పాలకొల్లులో మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-03-19T20:11:01+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బ్రాందీ షాపుల వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

పాలకొల్లులో మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బ్రాందీ షాపుల వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మహిళల తాళిబొట్లతో నిరసన వ్యక్తం చేస్తూ నాసిరకం బ్రాండ్స్ బ్రాందీ సీసాలను ధ్వంసం చేశారు. కల్తీ సారాను మించిన విషం జె బ్రాండ్స్ రూపంలో బ్రాందీ షాపులలో అమ్ముతున్నారని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జగన్ ధన దాహానికి తాళిబొట్లు తాకట్టు పెట్టడమే కాదు తెగిపోతున్నాయన్నారు. నాడు మద్యపాన నిషేధం అన్నారని... నేడు మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చినట్లుగా సారా మరణాన్ని సహజ మరణంగా మార్చేస్తున్నారన్నారు. అమ్మఒడి ఇచ్చి అక్రమ మద్యంతో నాన్ననే  లేకుండా చేస్తున్నారని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-03-19T20:11:01+05:30 IST