మూడేళ్లుగా అభివృద్ధి పనులు లేవు

ABN , First Publish Date - 2022-07-06T05:19:03+05:30 IST

పట్టణంలో మూడేళ్లుగా అభివృద్ధి పనులు లేవని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.

మూడేళ్లుగా అభివృద్ధి పనులు లేవు
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

పాలకొల్లు అర్బన్‌, జూలై 5: పట్టణంలో మూడేళ్లుగా అభివృద్ధి పనులు లేవని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.  30వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే నిమ్మల పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకు న్నారు. టీడీపీ హయాంలో డ్రైయిన్ల ప్రక్షాళనకు రూ.49లక్షలు మంజూరు చేయించి 30శాతం పనులు పూర్తి చేయించామన్నారు. ప్రభుత్వం మారడం తో మూడేళ్లుగా పనులు చేపట్టకపోవడంతో వార్డు ప్రజలు చిన్నపాటి వర్షాని కే ముంపు బారిన పడుతున్నారన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఎమ్మెల్యే నిమ్మల కోరారు. నెల లోపు పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే నిమ్మల వెంట మాజీ కౌన్సిలర్‌ ధనాని సూర్య ప్రకాష్‌, యడ్ల సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-06T05:19:03+05:30 IST